ఆలేరు టౌన్, ఏప్రిల్ 29 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇక నుంచి పారదర్శకంగా జరుగనున్నాయి. అయితే ఈ స్కీం కింద కొందరు కూలీలు పని చేయకున్నా.. చేసినట్లు గా రికార్డులు సృష్టించి డబ్బులు కాజేసిన ఘటనలు గతంలో అనేకసార్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఇక నుంచి ఉపాధి హామీల్లో చేపట్టిన ప నులను ఫొటోలు తీయాలి. సామాజిక తనిఖీల్లో వస్తున్న అ భ్యంతరాలను నియంత్రించేందుకు ఉపాధి హామీల్లో వర్క్ ఫైల్ ను ఖచ్చితంగా నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశాం. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఎక్కడ, ఏ ప్రాంతం లో పని చేస్తున్నారు ? పని ప్రదేశంలో ఫొటోలు తీసే విధానం గతంలో ఉన్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పూర్తిగా అమలు కాకపో వడంతో ఇప్పటి నుంచి మూడు రకాల ఫొటోలను తీసుకొని వర్క్ ఫైల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పని ప్రారంభిం చక ముందు, పని చేస్తున్నప్పుడు, పని పూర్తయిన ప్రదేశాల ఫొటోలను వర్క్ ఫైల్లో ఉంచాల్సిందే. ఇలా అయితే ప్రతి పని ని మదింపు చేయడంతో పాటు ఏ తేడా వచ్చిన గుర్తించే అవకా శం ఉంటుంది. ఇలా ప్రాథమిక దశల్లోనే కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆయా మండలాల పరిధిలోని టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధి పనుల ఫొటోలను తప్పనిసరిగా తీసుకోవా లి. ఫొటోలు తీయని టీఏలకు జరిమానా విధించాలని ఆదేశా లు జారీ చేశారు.
వర్క్ లొకేషన్ ఫొటోలు తీసి వాటిని సెల్ ఫొ న్లో భద్రపర్చుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రూ. 1000 జరిమానా విధిస్తారు. ఇలా అయితే ఆడిట్లో సులు వుగా గుర్తించవచ్చు. ఉపాధి పనుల ప్రారంభానికి ముందు పూర్తయిన తరువాత తీసుకునే ఫొటోలు సామాజిక తనిఖీలకు ఉపకరిస్తాయి. ఉపాధి పనులు పూర్తైన ఏడాది తరువాత సా మాజిక తనిఖీ బృందాలు ఆడిట్ నిర్వహించే సమయంలో ఎ లాంటి ఇబ్బంది ఉండదు. కొన్నిసార్లు అక్కడ వర్షాలు కురియ డం, రైతులు భూమి సాగు చేయడం, చదును చేయడం వల్ల ఎలాంటి ఆధారం లభ్యం కాదు. దీంతో ఆడిట్ బృందాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాంటప్పుడు ఆ పనికి సం బంధించిన ఫొటోలను సాక్ష్యాలుగా వర్క్ఫైల్ లో పొందుపరు స్తారు. జిల్లాలో 17 మండలాల పరిధిలోని 418 జీపీల్లో ఉపా ధి హామీ పనులు జరుగుతున్నాయి. శ్రమశక్తి సంఘాలు 796 7, జాబ్ కార్డులు 1,62,658 ఉన్నాయి. అలాగే జిల్లాలో ఎం డలు మండిపోతుండడంతో వీరికి వడదెబ్బ ముప్పు పొంచి ఉంది. దీంతో ఉపాధి హామీ పనుల సమయాన్ని మార్చారు. ఉదయం 7 నుంచి 11గంటల వరకు సాయంత్రం 4 నుంచి 6గంటల వరకు పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.