న్యూఢిల్లీ, జూన్ 3: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రూ.50 వేల కోట్లతో ఆరు అత్యాధునిక జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ‘మేకిన్ ఇండియా’ పథకంలో భాగంగా ‘పీ-75’ ప్రాజెక్టు పేరుతో ఈ కాంట్రాక్టును ముంబైకి చెందిన మజ్గావ్ డాక్యార్డ్కు ఇవ్వనున్నట్టు సమాచారం. శుక్రవారం జరుగనున్న అత్యున్నత స్థాయి సమావేశంలో దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనున్నది. కాగా రెండు అణ్వాయుధ జలాంతర్గాములతో కలిపి భారత నావికాదళంలో ప్రస్తుతం 15 జలాంతర్గాములు ఉన్నాయి.