న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన నిపుణుల బృందం.. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీతో కోవిడ్ టీకాల సరఫరా కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన వివరించారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో కనీసం 20 సార్లు మాట్లాడారని, వారి సూచనల మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ టెండర్లను ఆకర్షించడంలో రాష్ట్రాలు విఫలం కావడం వల్లే.. జూలై 21వ తేదీన నూరశాతం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు మంత్రి మాండవీయ తెలిపారు.