న్యూఢిల్లీ : నేషనల్ కాన్ఫ్రెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యం కోల్పోయి మునుపెన్నడూ లేనివిధంగా బలహీనపడిందని అన్నారు.
తాను చాలా నిజాయితీగా ఈ మాట అంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దేశాన్ని రక్షించాలనుకుంటే ఇకనైనా మేల్కొని బలంగా నిలబడాలని అన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ పార్టీ నాయకులు దృష్టిసారించాలని సూచించారు. ఇవన్నిఇంట్లో కూర్చుంటే సాధ్యం కావని గ్రహించాలని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.