మత్స్యకారుల పడవలో అగ్నిప్రమాదం.. 11 మందిని రక్షించిన ICG

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఓ మత్స్యకారుల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మంగళూరు తీరానికి పశ్చిమంగా 140 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోటులోని సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఒక మత్స్యకారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్గార్డ్-ICG) బృందాలు అక్కడికి చేరుకుని 11 మంది మత్సకారులను రక్షించారు.
తమిళనాడుకు చెందిన 11 మంది మత్స్యకారులు ఇటీవల At 1115h, CG డార్నియర్ బోటులో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే ఆదివారం తెల్లవారుజామున బోటులోని సిలిండర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. దాంతో బోటులోని మత్స్యకారులు ముంబైలోని మ్యారీటైమ్ రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్కు సమాచారం అందించారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన ICG.. 11 మంది మత్స్యకారులను కాపాడి తీరానికి చేర్చింది. తీవ్రంగా గాయపడి మత్స్యకారుడిని ఆస్పత్రిలో చేర్చింది.
Indian Coast Guard (ICG) rescues 11 fishermen, 140 nautical miles West off New Mangaluru, after their (fishermen's) fishing boat caught fire due to the explosion of a cylinder onboard: ICG pic.twitter.com/Oj0CB16Mqb
— ANI (@ANI) January 11, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- టెస్లా మస్క్ స్టైలే డిఫరెంట్.. పన్ను రాయితీకే ప్రాధాన్యం
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు