చార్మినార్, జూన్ 12 :నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ యువకుడు హత్యకు గురైయ్యా డు. ఈ సంఘటన హుస్సేనిఆలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బ హదూర్ఫుర ప్రాంతానికి చెందిన సయ్యద్ అన్వర్ కుమారుడు సయ్యద్ జుబేర్ (23) పాత నగరంలో పండ్లు విక్రయిస్తుంటాడు. ఇటీవల సయ్యద్.. కుటుంబం నుంచి వేరుగా ఉంటున్నాడు.. కాగా.. శుక్రవారం రాత్రి స్నే హితులను కలిసేందుకు శాలిబండ ప్రాంతానికి (ఆషా సినిమా హాల్ ప్రాంతంలో ప్రస్తు తం భవన నిర్మాణాలు చేపడుతున్నారు) వ చ్చాడు. అక్కడ సయ్యద్ జుబేర్ హత్యకు గురయ్యాడు. శనివారం ఉదయం సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ వెళ్లి పరిశీలించగా.. మృతుడి మెడ, కడుపుపై కత్తిగాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అలా గే.. ఘటనా స్థలాన్ని దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్, ఏసీపీ భిక్షంరెడ్డి పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.