జమ్ము: జమ్ముకశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదుల అలికిడి పెరిగిపోవడంతో పోలీసులు, ఆర్మీ గాలింపులు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగానే భటా దురియాన్ అడవుల్లో గత రెండు వారాలుగా జమ్ముకశ్మీర్ పోలీసులు, భారత సైనికులు సంయుక్తంగా కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కనిపించాయి. భద్రతా బలగాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. గాలింపులు ఇంకా కొనసాగుతున్నాయి.