న్యూఢిల్లీ: భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక 19వ ఎడిషన్ ‘వరుణ -2021’ నేవీ విన్యాసాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. అరేబియా సముద్రంలో ఈ నెల 28 వరకు ఇవి జరుగుతాయి. గైడెడ్-క్షిపణి స్టీల్త్ డిస్ట్రాయర్ కోల్కతా, గైడెడ్-క్షిపణి యుద్ధనౌకలు తార్కాష్, తల్వార్, ఫ్లీట్ సపోర్ట్ షిప్ దీపక్, సీకింగ్ 42 బి, చేతక్ ఇంటిగ్రల్ హెలికాప్టర్లు, కల్వరి క్లాస్ జలాంతర్గామి, పి8ఐ లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ భారత నావికాదళం తరుఫున పాల్గొంటాయని నేవీ అధికారులు వెల్లడించారు.