న్యూఢిల్లీ: భారత వాయుసేన కొత్త వాహనాలను ఇండక్ట్ చేసుకున్నది. ఆరు టన్నుల బరువైన .. లైట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వైమానిక దళంలో చేరాయి. ఎయిర్బేస్ల వద్ద భద్రతను పెంచేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. ఎటువంటి బుల్లెట్ లేదా గ్రేనేడ్ దాడులనైనా ఈ వాహనాలు తట్టుకోగలవు. ఉగ్రవాద దాడులను కూడా తిప్పికొట్టడంలో ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి. ఒక్కొక్క వాహనంలో ఆరు మంది కమాండోలు లేదా క్విక్ రియాక్షన్ బృంద సభ్యులు వెళ్లవచ్చు.