న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివ్రుద్ధి చేసిన వ్యాక్సిన్ వల్ల తలెత్తే సైడ్ ఎఫెక్ట్లపై లోతుగా సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడంతోపాటు ఇతర సమస్యలు తలెత్తడంతో దాని వినియోగాన్ని డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, థాయిలాండ్ తాత్కాలికంగా నిలిపివేశాయి. కొవిడ్-19పై నేషనల్ టాస్క్ఫోర్స్ సభ్యుడు ఎన్కే అరోరా స్పందిస్తూ భారత్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతికూల ఫలితాలు చాలా చాలా తక్కువ అని అభిప్రాయ పడ్డారు.
కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూరోనియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మాత్రం ఈ టీకాతో ఎలాంటి ప్రమాదం లేదని, బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నాయి. శుక్రవారం డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ మాట్లాడుతూ ఆస్ట్రాజెనెకా వాడకాన్ని తాము కొనసాగిస్తామన్నారు. దానిని వాడకూడదని చెప్పడానికి ఎలాంటి సూచనలు లేవన్నారు. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వెల్లడించింది.