మెదక్ రూరల్ , జూన్ 20: మండలం పరిధిలోని మంబోజిపల్లిలో ఆదివారం మెదక్ ,మాచవరం సెక్టార్లోని అంగవాడీ కేంద్రాలకు సరుకులను ఆర్టీసీకార్గో సర్వీసు ద్వారా అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగవాడీ సరుకులను హైదరాబాద్ నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా వస్తువులను సరఫరా చేస్తున్నామన్నారు కార్యక్రమంలో సీడీపీవో కార్యాలయం సీనియర్ అస్టెంట్ చిరంజీవి, కార్గోసర్వీస్ సిబ్బంది. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.