న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించడంలేదని సంబంధిత వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. దేశీయ అవసరాల దృష్ట్యా.. కొన్ని నెలలపాటు కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించబోతున్నదని బుధవారం కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంబంధిత వర్గాలు స్పందించాయి. విదేశాలకు టీకా ఎగుమతిలో ఎలాంటి మార్పు ఉండబోదని, కరోనాతో సతమతమవుతున్న పేద దేశాలకు సాయాన్ని అందిస్తామని పేర్కొన్నాయి. ఇప్పటివరకు భారత్.. 80 దేశాలకు 6.4 కోట్ల టీకా డోసులను ఎగుమతి చేసింది.