న్యూఢిల్లీ, జూలై 31: తూర్పు లఢక్లో హాట్స్ప్రింగ్స్, గోర్గాతో పాటు ఉద్రిక్తత ఏర్పడిన ప్రదేశాల్లో బలగాలను, ఆయుధాలను త్వరగా ఉపసంహరించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య 12వ దఫా చర్చలు శనివారం జరిగాయి. తూర్పు లఢక్లో 14 నెలలుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు పలికే లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వద్ద మోల్డో బోర్డర్ పాయింట్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి 7.30 గంటల వరకు కొనసాగాయి.