దేశంలో 3 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ.. వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,556 కొత్త కేసులు నమోదుకాగా 30,376 మంది రికవరీ అయ్యారు. దీంతో దేశంలో ప్రస్తుతం మిగిలి ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షల దిగువకు వచ్చింది. మంగళవారం ఉదయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,92,518గా ఉన్నది.
అయితే, మంగళవారం కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,75,116కు పెరిగింది. అందులో రికవరీలు 96,36,487, కరోనా మరణాలు 1,46,111 పోగా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షల కిందకు దిగి వచ్చింది. దాంతో దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో యాక్టివ్ కేసుల శాతం 3 నుంచి 2.90కి పడిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 223 ఫీల్డ్ రెజిమెంట్తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
- 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరు
- మీ 'టిప్' కో దండం సారూ...!
- ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- బారికేడ్లను బ్రేక్ చేసిన అన్నదాతలు.. వీడియో