న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,81,903 మంది మరణించారు. మరో 8,26,740 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో 71 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు కనిష్టస్థాయికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 1,03,570 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని, మరో 2,330 మంది మృతిచెందారని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 26,55,19,251 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. అదేవిధంగా నిన్న ఒక్కరోజే 19,31,249 మందికి కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో జూన్ 16 నాటికి కరోనా పరీక్షల సంఖ్య 38,52,38,220కు చేరిందని వెల్లడించింది.