న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,953 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,55,284కు పెరిగింది. కొత్తగా 23,653 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,11,07,332 మంది కోలుకున్నారని చెప్పింది. వైరస్ మహమ్మారి ప్రభావంతో 188 మంది మృత్యువాతపడగా.. మొత్తం మరణాల సంఖ్య 1,59,558కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,88,394 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకాల పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు 4,20,63,392 డోసులు వేసినట్లు వివరించింది.