న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 38,949 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 542 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 40,026 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,10,26,829గా ఉంది. యాక్టివ్ కేసులు 4,30,422గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇక ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,12,531గా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 39,53,43,767 మందికి కరోనా టీకా వేశారు. గత 24 గంటల్లో కొత్తగా 38,78,078 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకున్నది. పాజిటివిటీ రేటు 5 శాతం లోపే ఉన్నది. ప్రస్తుతం 2.14గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.