కందుకూరు, మే 1 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన గండు మహేందర్, కొల్కుల దాస్ అనారోగ్యంతో దవాఖానలో చేరారు. దవాఖాన ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. మహేందర్కు రూ. 43వేలు, దాస్కు రూ. 45వేల చెక్కును శనివారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదల అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల కంటే ప్రభుత్వ దవాఖానాలు దీటుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సర్పంచ్ గౌర కళమ్మ రాజు, గండు సురేశ్, రాజు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.