ఎదులాపురం, ఏప్రిల్ 15 : ఇంటి నుంచి బయటికి వచ్చే వారు మాస్క్ ధరించాలని, లేకుంటే జరిమానా తప్పదని టూ టౌన్ సీఐ పోతారం శ్రీనివాస్ సూచించారు. కలెక్టర్ చౌరస్తా వద్ద గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మాస్క్లు ధరించని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి జరిమానాలు విధించా రు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైనా మాస్క్లు ధరించకుం డా బయట తిరిగితే వారికి రూ.100 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే భౌతిక దూరం పా టించాలని తెలిపారు. ప్రతిరోజూ ప్ర త్యేక తనిఖీలు చేపడుతామని పేర్కొన్నా రు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు ప్రభాకర్, దీపక్సింగ్, జెస్సీ, తిరుమల పాల్గొన్నారు.
మాస్క్ లేకుంటే.. రూ.వెయ్యి కట్టాల్సిందే..
బేల, ఏప్రిల్ 15 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మండలంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెబుతూనే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జీవో నంబర్ 82 ప్రకారం ఈ చలాన్ ద్వారా రూ.1000 జరిమానా విధించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం మాస్క్ ధరించకుండా అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాలు నడుపుతున్న వారికి రూ.1000 చొప్పున జరిమానాలు విధించినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్, ఏప్రిల్ 15 : రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాగల్కొండ సర్పంచ్ జాదవ్ సునీత అన్నారు. మండలంలోని నాగల్కొండ జీపీ కార్యాలయంలో వార్డు సభ్యులతో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి, నిధుల సద్వినియోగంపై వివరించారు. పంచాయతీ సమస్యలపై తీర్మానించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కరోనా మహమ్మారి వణికిస్తున్నదని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు తప్పక ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్ అజార్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.