న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెకండ్ వేవ్లో భాగంగా గత ఆదివారం నుంచి దేశంలో గంటకు 10 వేల కేసులు, 60 మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం స్పష్టమవుతోంది. ఈ నెల 1న సగటున గంటకు 3,013 కేసులు, 19 మరణాలు నమోదవగా.. ఆ రోజు మొత్తం 72,330 కేసులు, 459 మరణాలు నమోదయ్యాయి.
ఇది కాస్తా ఆదివారానికి (ఏప్రిల్ 18) సగటున గంటకు 10,895 కేసులు, 62 మరణాలకు చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ రోజు దేశవ్యాప్తంగా 2,61,500 కేసులు, 1501 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక సోమవారం కేసుల సంఖ్య 2,73,810కి చేరగా.. మరణాలు 1619కి చేరింది. సోమవారానికి సగటున గంటకు 11,408 కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి.
ఇక వీటిలో మహారాష్ట్రనే టాప్లో ఉంది. ఆ రాష్ట్రంలో తాజా సగటు చూసుకుంటే గంటకు 2,859 కేసులు, 20 మరణాలు నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ ప్రకారం మొత్తం కేసుల్లో 10 రాష్ట్రాల వాటానే 82.74 శాతంగా ఉంది. రోజువారీ మరణాల్లో 351తో మహారాష్ట్ర తొలి స్థానంలో, ఢిల్లీ (240) రెండోస్థానంలో ఉన్నాయి.
రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. యూపీలో తాజాగా గంటకు 1274 కేసులు, 5 మరణాలు నమోదవుతున్నాయి. అటు ఢిల్లీలో గంటకు వెయ్యి కేసులు, 10 మరణాలు సంభవిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
కొవిడ్తో వెంటిలేటర్పై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
IPL 2021: కోహ్లికి మిస్టర్ నాగ్స్ పంచ్లు.. ఆర్సీబీ ఫ్లైట్లో ఫన్నీ సీన్స్
మార్స్పై నాసా హెలికాప్టర్ వెనుక మనోడు
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!
ఏప్రిల్ 30 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
కరోనాతో చెస్ ఆడుతున్నాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం: ఎయిమ్స్ చీఫ్
IPL 2021: వాషింగ్టన్, పడిక్కల్ దశ తిరిగింది.. ప్యూమాతో ఒప్పందం
IPL 2021: 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను: ధోనీ
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు