చెన్నై : దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఓటరు జాబితాలో ఏకంగా ఆమె పేరు గల్లంతైంది.
శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజు ముందు ఈ విషయం వెలుగులోకి రావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
అమ్మల్ మక్కల్ మున్నేట్ర కఝగం (ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరణ్ దీన్ని ఏఐఏడీఎంకే కుట్రగా ఆరోపిస్తున్నారు. విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
20 ఏండ్లుగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఆమెకు ఓటు హక్కు ఉంది. కాగా పోయెస్ గార్డెన్లోని ఆస్తులను జప్తు చేశాక ఆమె పేరును అధికారులు తొలగించారని సమాచారం.
అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లు జైలుశిక్ష అనుభవించిన శశికళ జనవరి 27న విడుదలయ్యారు. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటూ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి