తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీపై కూడా బాగా ఫోకస్ పెడుతున్నారు. అక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలను టాలీవుడ్లోను విడుదల చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉన్నారు. అయితే తమిళ హీరో విజయ్ ఇన్నాళ్లు డబ్బింగ్ సినిమాలతో అలరించగా, ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇటీవల చెన్నైకు వెళ్లి ఇంట్రెస్టింగ్ స్ట్రిప్ట్ నరేట్ చేశారట. ఇది విజయ్కు ఎంతగానో నచ్చడంతో వెంటనే ఓకే అనేశాడని తెలుస్తుంది.
ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి, వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట విజయ్. బైలింగ్యువల్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన 65వ సినిమాతో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ జూన్ నుండి ప్రారంభం కానుంది. మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోను విజయ్ ఓ మూవీ చేయనున్నాడట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు తెలుస్తుంది.