హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవోలు) మోత మోగుతున్నది. ఇప్పటికే చాలా సంస్థలు ఐపీవోకు రాగా, మరిన్ని కంపెనీలు క్యూ కడుతున్నాయి. జొమాటో రూ.9,375 కోట్ల ఐపీవో ఇవాళ ప్రారంభమవుతున్నది. రూ.72-76 ధరల శ్రేణితో జారీ అయ్యే ఈ ఐపీవోతో జొమాటోకు రూ.64,365 కోట్ల విలువ ఏర్పడనున్నది. జొమాటో రెస్టారెంట్కు చెందిన ఐపీవో మార్కెట్లో మూడు రోజుల పాటు ఓపెన్గా ఉంచనున్నారు. జూలై 16వ తేదీ వరకు ఐపీవో అందుబాటులో ఉంటుంది. ఇండియాలో ఐపీవోకు వెళ్తున్నతొలి డిజిటల్ కంపెనీ జొమాటో కానున్నది. ఇదే బాటలో ఫ్లిప్కార్ట్, పేటీఎం, ఓలా కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. జూలై 27వ తేదీన జొమాటో షేర్లు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లిస్టులో కనిపించనున్నాయి.