భోపాల్ : మధ్యప్రదేశ్లో ఈ ఏడాదిలో 44 మంది మృత్యువాతపడగా.. ఒక్క ఏప్రిల్లో 42 మంది మరణించారు. ఈ నెల రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మృతి చెందిన 42 మందిలో సుమారు 30 మంది సింగిల్ డోస్, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారున్నారు. మృతుల్లో ఎక్కువగా 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారు, మరికొందరు 40-49 ఏళ్ల మధ్య వయస్సున్నవారున్నారు. మృతుల్లో 38 ఏళ్ల వయస్సున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చిన్నవాడు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో పోలీసుశాఖలో కొవిడ్ మరణాలు భారీగా పెరిగాయి.
2020 మార్చి, డిసెంబర్ మధ్య 35 మంది పోలీసులు వైరస్ బారినపడి మృతి చెందితే.. ఈ ఏడాది 44 మంది కన్నుమూశారు. ఇప్పటి వరకు పోలీసుశాఖలో వ్యాక్సినేషన్లో భాగంగా 90 శాతం మందికి టీకాలు వేసినా.. మరణాలు నమోదయ్యాయి. దీనిపై మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ మాట్లాడుతూ మృతుల్లో చాలా మంది సిబ్బంది కొవిడ్ ఒకటి, రెండో మోతాదు తీసుకున్నవారు ఉన్నారని తెలిపారు. రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారని పేర్కొన్నారు.