న్యూఢిల్లీ: కరోనా టీకాలు (Covid Vaccine) వేయడంలో భారతదేశం కొత్త మైలురాయిని అందుకున్నది. దేశంలో ఇప్పటివరకు 75 కోట్లకు పైగా కొవిడ్-19 వ్యాక్సిన్లు అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘సబ్ కా సాథ్, సబ్ కా ప్రయాస్’ అనే మంత్రంతో వ్యాక్సినేషన్ యాత్ర కొత్త కోణాలను సృష్టిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
టీకాలు వేయడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని చేరుకున్నది. సోమవారానికి భారత్లో మొత్తం 75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘భారతదేశానికి అభినందనలు! స్వాతంత్య్రం వచ్చిన 75 వ సంవత్సరంలో దేశం 75 కోట్ల టీకాల సంఖ్యను దాటింది’ అని ఆరోగ్య మంత్రి # సబ్ కో వ్యాక్సిన్, ముఫ్త్ వ్యాక్సిన్.. #ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే హ్యాష్ట్యాగ్లతో ట్వీట్ చేశారు.
ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన సిక్కిం, హిమాచల్ప్రదేశ్, గోవా, దాద్రా నగర్ హవేలి, లడక్, లక్షద్వీప్ – వయోజన ప్రజలందరూ కనీసం ఒక మోతాదు టీకాను తీసుకున్నారు. వ్యాక్సిన్లు ఇవ్వడంలో భారతదేశం కొత్త మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హర్షం వ్యక్తం చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ను వేగవంతం చేసినందుకు భారతదేశానికి అభినందనలు తెలిపింది.
లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
నీట్ వ్యతిరేక బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
సౌరశక్తి పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలి: వెంకయ్యనాయుడు
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్ప్రెస్వే
పాకిస్తాన్కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..