జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని రెగోండా మండలం రంగయపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తాటి చెట్టు నుంచి కింద ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొమురెల్లి (65) గా గుర్తించారు. వర్షం కారణంగా చెట్టు జారడంతో అతను చెట్టు మీద నుంచి పడి తీవ్రగాయాలపాలై చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పర్కాల్ సీహెచ్సీకి తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా బంధువులు ప్రభుత్వాన్ని కోరారు.