న్యూఢిల్లీ : ఓటు వేసి వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి, ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానంతో పాటు కర్ణాటక, రాజస్థాన్లో ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఈ క్రమంలో ఆయన ట్వీట్ చేశారు. అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి