హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ర్టానికి చెందిన యువ చెస్ ఆటగాడు ప్రణీత్ వుప్పల.. ఆన్లైన్ జాతీయ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. అండర్-14 విభాగంలో 11 రౌండ్లకు గానూ 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ప్రణీత్ చాంపియన్గా అవతరించాడు. ప్రస్తుతం 2253 రేటింగ్ పాయింట్లతో ఉన్న ప్రణీత్.. మూడు, నాలుగు రౌండ్లను ‘డ్రా’చేసుకొని మిగిలిన అన్నీ రౌండ్లలో ప్రత్యర్థులను చిత్తుచేశాడు. రాజస్థాన్కు చెందిన వ్రశాంక్ చౌహాన్ (9.5 పాయింట్లు), మహారాష్ట్రకు చెందిన సందీప్ (9 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.