న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ఆ రాష్ట్రంలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చెప్పకుండా వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకమని. మీ సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని తక్షణం అమలు చేయాలని మమత ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
కాగా, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీలో తప్ప దేశవ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రేషన్ పథకం అమలవుతున్నది. అయితే రాజకీయ కారణాలతో సీఎం మమత బెంగాల్లో, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.