న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోవని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య అపనమ్మకం, అనుమానం దశాబ్దాల నుంచి కొనసాగుతున్నదన్నారు. ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని ఏర్పర్చుకోవాలంటే పాకిస్థాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించడం మానుకోవాలని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నవరణె అభిప్రాయపడ్డారు.
నమ్మకాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత పూర్తిగా పాకిస్థాన్పైనే ఉందని చెప్పారు. నరవణే జమ్ము-కశ్మీర్లో భద్రత పరిస్థితులను గురువారం సమీక్షించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేయడానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక కమాండర్లు ఆయనకు వివరించారు. అన్ని వేళలా అప్రమ్తంగా, సంసిద్ధంగా ఉన్నందుకు సైనికులను ప్రశంసించారు.
జనరల్ నరవణె ఇటీవల మాట్లాడుతూ.. భారత్తో సంత్సంబంధాలను కోరుకుంటే ముందుగా ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పాకిస్థాన్ నాశనం చేయాలన్నారు. కాల్పుల విరమణను ఇరు దేశాల సైన్యాలు పాటిస్తుండటం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భద్రత విషయంలో మంచి పరిణామమని తెలిపారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని రెచ్చగొట్టే విధానాలను పాకిస్థాన్ విడనాడాలని సూచించారు.