రాందేవ్ బాబాకు ఐఎంఏ నోటీసు
డెహ్రాడూన్, మే 26: అల్లోపతి వైద్యంపై, అల్లోపతి వైద్యులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పరువునష్టం నోటీసు పంపింది. 15 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో నష్టపరిహారం కింద రూ.వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తామని పేర్కొంది. ఆరు పేజీల నోటీసును ఐఎంఏ (ఉత్తరాఖండ్) కార్యదర్శి అజయ్ ఖన్నా తరఫున ఆయన న్యాయవాది నీరజ్ పాండే పంపారు. రాందేవ్ వ్యాఖ్యలు… అల్లోపతి వైద్యాన్ని, అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న 2 వేల మంది వైద్యుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.