న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో దేశ వ్యాప్తంగా 730 మంది వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. బీహార్లో గరిష్ఠంగా 115 మంది, తర్వాత ఢిల్లీలో 109 మంది వైద్యులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. రాష్ట్రాల వారీగా సెకండ్ వేవ్లో మరణించిన వైద్యుల సంఖ్యను ఐఎంఏ విడుదల చేసింది.