ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కృష్ణకాలనీ/ మొగుళ్లపల్లి, మే 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కాశీంపల్లి, భాస్కర్ గడ్డ, వేశాలపల్లిలో జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట, మొట్లపల్లి, పర్లపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో గండ్ర మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత పాలకులు వ్యవసాయాన్ని దండుగ అని హేలన చేస్తే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతంరం సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా తయారు చేశారన్నారు. జిల్లాలో రైతులు పండించే ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్ద న్నారు. ఇస్సీపేటలో గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అలాగే భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పెద్దకుంటపల్లిలో 11వ వార్డు కౌన్సిలర్ బానోతు రజితాజుమ్ములాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ లక్ష్మి జాతరలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో గ్రామ దేవతలను ప్రతిష్టించుకుంటే ఆ గ్రామ ప్రజలకు సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అన్నారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు మంగళపెల్లి తిరుపతి, బద్ది సమ్మయ్య, బానోతు రజి తాజుమ్ములాల్, పీఏసీఎస్ డెరక్టర్ వేణుగోపాల్, కో ఆప్షన్ సభ్యుడు దొంగల ఐలయ్య, టీఆర్ఎస్ అర్బన్ ప్రధాన కార్యదర్శి తాటి అ శోక్గౌడ్, ఆలయ డైరక్టర్లు గురిజాల శ్రీనివా స్, శ్యామ్, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ముద్దమల్ల భార్గవ్, టీఆర్ఎస్ మైనార్టీ విభా గం అర్బన్ అధ్యక్షుడు బాబుమియా, నాయకులు బుర్ర రమేశ్, జాగరి అజయ్ యాదవ్, అల్లూరి కు మార్, బొంతల సతీశ్, పోలవేణి ప్రసాద్, పోలవేణి అశోక్, నలిగేటి సతీశ్, మోతె రాజు, మధన్మోహన్, సల్ల రవీందర్, లారీ అసోసియేషన్ నాయకులు బేతు రమేశ్, జనగాం శ్రీనివాస్, వేశాల రవీందర్, కరాటే శ్రీనివాస్, మహిళ నాయకులు వాసాల స్వప్న, క్యాతరాజు స్వప్న, మొగుళ్లపల్లి జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాతాసంజీవరెడ్డి, సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు పాల్గొన్నారు.