న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అల్లోపతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాపై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అల్లోపతి మందులకు వ్యతిరేకంగా రాందేవ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐఎంఏ స్పందించింది.
రాందేవ్ బాబా చేసిన ఆరోపణలను అంగీకరించి ఆధునిక వైద్యానికి స్వస్తి పలకడం లేదా అంటువ్యాధుల చట్టం కింద ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని ఐఎంఏ ఓ ప్రకటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ను డిమాండ్ చేసింది. ఈ వీడియాలో రాందేవ్ బాబా మాట్లాడుతూ ఆధునిక అల్లోపతి పనికిమాలినది..ఇది విఫలమైన వైద్య శాస్త్రమని చేసిన వ్యాఖ్యలను మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చామని ఐఎంఏ పేర్కొంది.