పనులు ప్రారంభించని వారి అగ్రిమెంట్ రద్దు చేయాలి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
అధికారులు, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి, జూలై 12 (నమస్తేతెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ భవనాలతో పాటు వంటగదులు, టాయిలెట్స్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. సోమవా రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల భవనాలు, అంగన్వాడీ కేంద్రా లు, వంట గదులు, టాయిలెట్స్ పనులను ప్రారంభించని కాంట్రాక్టర్ల అగ్రిమెంట్ రద్దు చేయాలని అధికారులకు సూచించారు. మొగుళ్లపల్లి మండలంలో నిర్మించిన కేజీ టు పీజీ కళాశాల అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం పనులకు కావాల్సిన నిధుల విషయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రతిపాదనలు కూడా పంపించినట్లు చెప్పారు. టేకుమట్ల మండలంలో నిర్మిస్తున్న కేజీబీవీ పాఠశాలకు కావాల్సిన నిధుల కోసం ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమీక్షలో ఈఈ షఫీమియాన్, డీఈ నర్సింహచారి, ఏఈలు జీవన్, రాజు, కాంట్రాక్టర్లు సుధీర్, పాపయ్య పాల్గొన్నారు.
కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రేగొండ : కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉం టూ జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయలో 15 మందికి రూ.4.80 లక్షల విలువగల సీఎఆర్ఎఫ్ చెక్కులు మంజూరవగా సోమవారం ఎమ్మెల్యే గండ్ర లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరో నాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ ఆర్థిక సా యం అందజేస్తున్నారని తెలిపారు. కొవిడ్పై ప్రజలు అప్రమతంగా ఉండాలన్నారు. ప్రతి ఒకరూ టీకా తీసుకోవాల ని, ఇప్పటినుంచి నిరంతరం వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి గా వాడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సాయిని విజయ, ఎంపీపీ పున్నం లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్గౌడ్, ఎంపీటీసీ ఐలి శ్రీధర్ గౌడ్, నాయకులు కందురు విద్యాసాగర్రెడ్డి, ముత్యం రవి, మైస భిక్షపతి, రాజు, చిగురు మామిడి రాజు పాల్గొన్నారు.