న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య 5 టెస్టుల సిరీస్లో పాల్గొంటుంది. మరోవైపు వచ్చే నెలలో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్ టీమ్ కూడా ఇంగ్లీష్ టూర్కు వెళ్లనుంది.
భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి పురుషులు, మహిళల క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు
ఒకే చార్టర్డ్ విమానంలో కలిసి ఇంగ్లాండ్కు ప్రయాణించనున్నారు. భారత బృందం జూన్ 2న ముంబై నుంచి బయల్దేరనుంది.
‘మే 19న ముంబైలో సమావేశం కావాలని సూచించారు. కఠిన క్వారంటైన్ తర్వాత జూన్లో ఇంగ్లాండ్కు వెళ్తామని’ మహిళల క్రికెట్ టీమ్కు చెందిన క్రీడాకారిణి పేర్కొంది. అక్కడికి చేరుకున్నాక ఇరుజట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభిస్తారు.