అవకాశం ఉంటే రజినీ పార్టీతో పొత్తు: పన్నీర్ సెల్వం

చెన్నై: రాజకీయాల్లోకి రావాలన్న సూపర్స్టార్ రజినీకాంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేకు చెందిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. ఆయన పార్టీతో పొత్తు గురించి గురువారం స్పందించారు. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చని అన్నారు. అవకాశం ఉంటే రజినీ పార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మరోవైపు రజినీ రాజకీయ ప్రవేశంపై డీఎంకే కూడా స్పందించింది. ఆయన పార్టీ వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని, తమ ఓటు బ్యాంకుకు వచ్చే నష్టం ఏమీలేదని డీఎంకే సీనియర్ నేత ఏ రాజా తెలిపారు. అధికార అన్నాడీఎంకేపై వ్యతిరేకత, అవినీతి డీఎంకే గెలుపునకు దోహదపడుతుందని చెప్పారు.
సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత గురువారం తొలగిపోయింది. ఆయన పార్టీ పెడతారా లేదా అనే మీమాంసలో అభిమానులు ఉన్న తరుణంలో డిసెంబర్ 31న పార్టీపై ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ లాంచింగ్ కార్యక్రమం ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో రజినీ అభిమానులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాట రాజకీయం వేడెక్కుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి