న్యూఢిల్లీ, మార్చి 29: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి అని మెసేజ్ వచ్చినప్పుడల్లా చేస్తుంటారా.. అయితే ఈ సారి తొందరపడకండి. ‘సిస్టమ్ అప్డేట్’ అని వస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే హ్యాకర్లు సిస్టమ్ అప్డేట్ పేరుతో ఫోన్లపై నియంత్రణ సాధించి ఫొటోలు, మెసేజ్లు, ఫోన్ నంబర్లు తదితర సమాచారాన్ని దొంగలిస్తున్నారని మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపీరియం ల్యాబ్స్ వెల్లడించింది. ఇది చాలా అత్యాధునాతనమైన మాల్వేర్ అని తెలిపింది. సిస్టమ్ అప్డేట్ పేరుతో వచ్చే ఈ మాల్వేర్ను ఇన్స్టాల్ చేస్తే ఫోన్పై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ లభిస్తుందని పేర్కొన్నది. వారు ఎక్కడనుంచైనా ఫోన్ను కంట్రోల్ చేయవచ్చని తెలిపింది.
ఇవీ కూడా చదవండి..
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్