కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజలందరు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఆనందయ్య చాలా మంది జీవితాలలో వెలుగు నింపారు. ఆయుర్వేదం పద్దతలు ద్వారా మందుని తయారు చేసి చాలా మందికి కరోనా నయం చేశారు.నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇప్పుడు ఆయన తయారు చేసిన నాటు మందును కోవిడ్ మందుగా పరిగణించాలా లేదా అనే మీమాంసలో అధికారులు ఉన్నారు.
ఆనందయ్యకు రోజురోజుకు మద్దతు బాగా పెరుగుతుంది. తాజాగా జగపతి బాబు తన ట్విట్టర్లో కరోనాతో కకావికలం అవుతుంటే ప్రకృతి తల్లి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందేమోనని అనిపిస్తుంది. సహజసిద్ధమైన వైద్యానికి సర్కారు నుండి అనుమతి రావాలని ప్రార్ధిస్తున్నాను. ఈ మందు ప్రపంచాన్ని కాపాడాలి, దేవుడు ఆయనను ఆ రకంగా ఆశీర్వదించాలి అని జగ్గూభాయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.