న్యూఢిల్లీ, జూలై 23: ఐసీఎస్ఈ ( ICSE ) పది, పన్నెండో తరగతుల పరీక్షా ఫలితాలను శనివారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) వెల్లడించింది. ఫలితాలను వెబ్సైట్లో ఉంచడంతోపాటు, మెసేజ్ల రూపంలో ఫోన్లకు సందేశాలు పంపిస్తామని అధికారులు తెలిపారు.