భోపాల్ : మధ్యప్రదేశ్లో రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ ఉండబోడని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆదివారం స్పష్టం చేశారు.
ప్రజల సహకారంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ మాత్రం విధిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం భోపాల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
కరోనా సంక్షోభానికి లాక్డౌన్ పరిష్కారం కాదని అన్నారు. ప్రజల జీవనోపాధి కోసం ఆర్థిక కార్యకలాపాలు కొనసాగాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
‘‘జిల్లాల్లో సంక్షోభ యాజమాన్య బృందాలు స్థానిక ప్రజలతో మాట్లాడి వైరస్ కట్టడికి కృషి చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు స్వీయనియంత్రణ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరోనా కర్ఫ్యూ విధించాం. ఇది లాక్డౌన్ కాదు. కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక మినహాయింపులు ఇచ్చాం’ అని సీఎం చెప్పారు.
ఇండోర్తో సహా పలు నగరాల్లో ఈ నెల 19 వరకు పలు జిల్లాల్లో 22 వరకు లాక్డౌన్ వరకు లాక్డౌన్ పొడిగించనున్నట్లు శనివారం ఆ రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేశ్ రజోజా తెలిపారు.
దీంతో రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ ఉండనుందని ప్రజలు చర్చించుకుంటున్న తరుణంలో సీఎం దీనిపై స్పష్టతనిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి