న్యూఢిల్లీ: భారత్ వంద కోట్ల టీకా మైలురాయికి చేరిన నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బిల్డింగ్ త్రివర్ణ కాంతులతో ప్రకాశించింది. దేశంలోని వంద స్మారక కట్టడాలు జాతీయ జెండా రంగులతో వెలుగులు విరజిమ్మాయి. వంద కోట్ల వ్యాక్సినేషన్ను పురస్కరించుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మేరకు ప్రత్యేక చొరవ చూపింది.