కోల్కతా: దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 115 స్కీంలు తెగా.. పశ్చిమ బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీ 115 స్కాంలు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శించారు. మమత పాలనలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని దుయ్యబట్టారు.
మమత మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదల సంఖ్య మరింత పెరగడం ఖాయమన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్షా మంగళవారం నాడు గోసబాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు అమరవీరుల దినం సందర్భంగా భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు అమిత్షా నివాళులు అర్పించారు.
తన మేనల్లుడిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని తయారుచేసేందుకు మమత పావులు కదుపుతున్నారని అమిత్షా చెప్పారు. అదే ప్రధాని మోదీ దేశ ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాత్రనకా పగలనకా కష్టపడుతున్నారని అన్నారు. పేదలను దోచుకుని టీఎంసీ నేతలు ధనికులుగా మారుతున్నా నోరు మెదపడం లేదెందుకో మమతా బెనర్జీ తెలుపాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలనే దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టగానే సీఏఏను అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి తెలిపారు.
బెంగాల్ ప్రాంతం అంతా అవినీతి, ఆశ్రితపక్షపాతంతో నిండిపోయిందని విచారం వ్యక్తం చేశారు. తమకు అధికారం అప్పగిస్తే రెండేండ్లలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని అమిత్షా హామీ ఇచ్చారు. మమతా తానుచ్చిన 282 హామీల్లో 82 కూడా తీర్చలేకపోయారని, తాము అధికారంలోకి రాగానే సుందర్బన్ జిల్లా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మేధినీపూర్ నిర్వహిస్తున్న ర్యాలీలో నడ్డా పాల్గొంటారు.
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్షిప్..!
ఆర్టిస్ట్ లండన్లో.. మహిళ నెదర్లాండ్స్లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.