రామాయణ గాథ ఆధారంగా నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నిమిత్ మల్హోత్రా ఓ పాన్ ఇండియన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ పౌరాణిక చిత్రంలో రావణుడిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రతినాయకుడి పాత్ర కావడంలో అతడి లుక్, ఆహార్యాన్ని వినూత్నంగా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’కు పనిచేసిన కాస్ట్యూమ్, మేకప్ బృందం సారథ్యంలో హృతిక్రోషన్ పాత్రను వినూత్న పంథాలో సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిసింది. త్రీడీ సాంకేతికతతో అయిదు వందల కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. సీత పాత్రలో దీపికా పడుకోన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.