జమ్ము: జమ్ము ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 27న ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేసి పేలుడు పదార్థాలను జారవిడిచిన ఘనటలో రెండు పేలుళ్లు జరిగాయి. అలాగే గత నాలుగు రోజుల్లో జమ్ములోని సైనిక స్థావరాల సమీపంలో ఏడు డ్రోన్ల కదలికలను భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో జమ్ము ఎయిర్ బేస్లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, సాఫ్ట్ జామర్ల ఏర్పాటుతోపాటు యాంటీ డ్రోన్ గన్స్ను జమ్ము ఎయిర్ బేస్లో మోహరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.