ఎల్బీనగర్, ఏప్రిల్ 27: హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో అక్రమంగా అధిక ధరలకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్నగర్ లెక్చరర్స్కాలనీకి చెందిన చెన్నంపల్లి పరుశరాములు సన్రైస్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు. ఎల్బీనగర్ ఆర్టీసీకాలనీకి చెందిన రమావత్ జాను, సరూర్నగర్ బాపునగర్కు చెందిన సపావత్ ఉపేందర్ ఆపరేషన్ థియేటర్లో సహాయకులు. వీరు ముగ్గురు దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ సమీపంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ధర రూ.3,490 ఉండగా.. అక్రమంగా రూ.31 వేలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు నిందితులను అరెస్టుచేశారు. వారినుంచి ఎనిమిది ఇంజెక్షన్లు, రూ.31వేలు నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.