హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్లో నిర్వహించనున్నారు. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పీజీ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నారు.