బీజేపీతో పొత్తు ఉంటే సీఎంగానే ఉండేవాడిని: కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఇంకా సీఎం పదవిలో ఉండేవాడినని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యపై శనివారం మండిపడ్డారు. 2006 నుంచి 12 ఏండ్ల పాటు సాధించుకున్న పరపతి కాంగ్రెస్తో పొత్తు వల్ల పోయిందని విమర్శించారు. 2006లో బీజేపీతో అధికారం పంచుకునే సమస్య వల్ల సీఎం పదవి నుంచి దిగినప్పటికీ ప్రజల మద్దతు, ఫాలోయింగ్ తనకు ఉండేదని అన్నారు. 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత సిద్ధరామయ్య, ఆయన బృందం తన కీర్తిని నాశనం చేశారని ఆరోపించారు.
తన తండ్రి దేవెగౌడ వల్లనే కాంగ్రెస్ ఉచ్చులో పడ్డానని కుమారస్వామి వాపోయారు. తన తండ్రిని బాధపెట్టడం తనకు ఇష్టం లేదని, సెక్యూలర్పై ఆయనకున్న నమ్మకం వల్లనే బీజేపీతో పొత్తుకు నిరాకరించారని చెప్పారు. దీంతో 2018లో కాంగ్రెస్తో పొత్తుతో సీఎం పదవిని చేపట్టిన నెల రోజుల్లోనే ఎంతో వేదన అనుభవించాని, కన్నీళ్లను దిగమింగుకున్నానని వాపోయారు. కాగా శనివారం బెలగావి ఎయిర్పోర్టులో సీఎం బీఎస్ యెడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కలిసి కూర్చొని కనిపించిన తరుణంలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?