ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారినపడి బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే (49) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. పాస్కల్ ధనారేకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన గుజరాత్ రాష్ట్రం వ్యాపి పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి ముంబై ఆస్పత్రికి తరలించారు.
అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున ధనారే మరణించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా, దహనుకు చెందిన ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ధనారేకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య