హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి సెకండ్వేవ్ విస్తరణను అరికట్టేందుకు విధించిన రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగించింది. ఏప్రిల్ 20న కర్ఫ్యూ ప్రకటించిన సందర్భంగా విధించిన నిబంధనలన్నీ అమలులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వులతో రాత్రి 8 గంటలలోపే అన్ని వ్యాపార సం స్థలు, కార్యాలయాలు, దుకాణాలు, సంస్థలు, రెస్టారెంట్లు మూసివేయాలి. మరికొన్ని రోజులు రాత్రి కర్ఫ్యూ విధిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన సర్కారు తాజాగా మరోవారం రోజులు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది.
మినహాయింపులు ఈ సేవలకు మాత్రమే..
గుర్తింపు కార్డులు తప్పనిసరి
మినహాయంపు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు ఇచ్చే ఎమర్జెన్సీ డ్యూటీ గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి. అన్ని ప్రైవేటు దవాఖానల్లో పనిచేసే వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్స్, దవాఖాన సర్వీస్ ప్రొవైడర్స్కు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి. వైద్య సేవలు పొందే గర్భిణిలు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి ఇండ్లకు వెళ్లే వ్యక్తులు వారు ప్రయాణం చేసిన టికెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. అంతర్రాష్ట్ర వస్తువుల రవాణపై ఎలాంటి ఆంక్షలు లేవు. వాటికి ప్రత్యేక పాస్లు అవసరం లేదు. అటోలు, ట్యాక్సీలతో సహా ప్రజా రవాణా సేవలు కర్ఫ్యూ సమయంలో మినహాయింపు ఇచ్చిన వారికి మాత్రమే పరిమితం. రాత్రి కర్ఫ్యూ నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు.
ఇవీ కూడా చదవండి…
కొనసాగుతున్న కరోనా నియంత్రణ చర్యలు
రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగించాం